NZB: బాల్కొండ మండలం వన్నెల్ (బీ)లో పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అహింసాహిత మహా కరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహిస్తూ శాకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి జ్ఞానదాతగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి ఉత్సాహంతో శాకాహార ర్యాలీలు నిర్వహించారన్నారు.