BDK: కొత్తగూడెం పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆదివారం పద్మశాలి కళ్యాణమండపంలో ఎన్నికల కన్వీనర్ పుట్టా శంకరయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా ప్రసాద్ ఉపాధ్యక్షుడుగా ఉదయ్ కుమార్ కార్యదర్శిగా శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీగా మాధవ్ రావు ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ నూతన కమిటీతో సంఘం మరింత ముందుకు సాగాలని పెద్దలు కోరారు.