గ్యాస్ కొరతతో తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ నిలిచిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గడంతో మూడేళ్లుగా ఇస్తున్న ఉచిత లడ్డూల తయారీకి బ్రేక్ పడింది. అయితే భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే కట్టెల పొయ్యిపై లడ్డూలు చేసి పంపిణీ చేయనున్నారు.