MDK: నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు, బైక్ ఒక గేదెను ఢీకొనడంతో ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.