SRD: గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి బోనాల జాతర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో భారీగా భక్తులు హాజరై బోనాలు సమర్పించారు.