MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మరణించారు. ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావులు ఆదివారం గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలోని ఆయన ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్ కుటుంబసభ్యులను పరామర్శించి తమ సానుభూతి తెలిపారు.