CTR: గత ప్రభుత్వ హయాంలో కరోనా కాలాన్ని మినహాయిస్తే మూడేళ్ల పాటు నగరిని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి రోజా చెప్పారు. తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ కార్యవర్గ సభ్యులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు నగరిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.