TG: ఆర్థిక సంక్షోభంలోనూ హామీలను అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దొడ్డు బియ్యం స్మగ్లింగ్ ద్వారా డబ్బులు కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. బీజేపీ నేతలు కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ నెలాఖరులో కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు.