KKD: అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల కారణంగా స్థానిక ఆక్వా రంగం తీవ్రంగా ప్రభావితమైంది. రొయ్యల ఎగుమతులు దాదాపు నిలిచిపోవడంతో.. గతంలో కిలో రూ.500 వరకు ఉన్న రొయ్యల ధరలు రూ. 150కి పడిపోయాయి. కాకినాడ జిల్లాలోని రొయ్యల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో తక్షణ సహాయం అందించి తమని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.