KRNL: నగరంలోని పద్మశాలి నగర్ కాలనీ ప్రజలు తమ సమస్యలను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మకు ఆదివారం వివరించారు. టీడీపీ కార్యాలయంలో ఆమెను కలిసి సమస్యల పరిష్కారం కోరారు. సమస్యలను విన్న ఆది కృష్ణమ్మ, అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.