TPT: తిరుమల తిరుపతి దేవస్థానాలుకు చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ రూ. కోటి విరాళం అందించింది. ఈ విరాళాన్ని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి అందించారు. దాత జే. రాజా రమేష్, టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.