SKLM: రానున్న పలాస మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు క్లస్టర్, యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.