NDL: చాగలమర్రి మం.నీలంపాడు రాంపల్లి గ్రామాల మధ్య ఆదివారం ద్విచక్రవాహనం – ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జంగాలపల్లికు చెందిన మహబూబ్ బాషా ద్విచక్ర వాహనంపై చాగలమర్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు క్షతగాత్రుడిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.