CTR: బైరెడ్డిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 25న కోలారు జాలప్ప ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి విజయ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. నేత్ర వైద్య నిపుణుల సలహాతో లెన్స్ అమర్చడం, అవసరమైన వారికి నేత్ర శస్త్రచికిత్సలు చేస్తారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.