కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి భూ వివాదాలు, పింఛన్లు, రేషన్, గృహాలు, రహదారులు, తాగునీరు వంటి అంశాలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.