NZB: ఎడపల్లి వారాంతపు సంత నిర్వహణ కోసం జీపీ ఆధ్వర్యంలో ఇవాళ 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జీపీ కార్యదర్శి నాగరాజు గౌడ్ తెలిపారు. ఈ వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 20 వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, అత్యధిక ధర పలికిన వారికి 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు సంత నిర్వహణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.