NZB: రాష్ట్ర బడ్జెట్లో బంజారాలకు నిధులు కేటాయించలేదని బంజారా నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ AIBSS నియోజకవర్గం నాయకులు దుప్ సింగ్ నాయక్, సంతోష్, బంతిలాల్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ను బోధన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బంజారాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.