PLD: యుద్ధ పరిస్థితులు ముగిసే వరకు గ్యాస్ను పొదుపుగా వినియోగించాలని నకరికల్లు తహసీల్దార్ పుల్లారావు ప్రజలకు సూచించారు. గ్యాస్ కొరతపై ఆందోళన చెందవద్దని, బుకింగ్ ప్రాధాన్యతను బట్టే సిలిండర్ల పంపిణీ సజావుగా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన హెచ్చరించారు.