నటిగా తాను ఇప్పుడు పరిపూర్ణంగా సిద్ధమయ్యానని, దర్శకులు తనను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లు రాయడమే అసలైన పురస్కారమని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ‘సీతారామం’తో లభించిన గుర్తింపు తన కెరీర్కు ఊతమిచ్చిందని తెలిపింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్న ఆమె, హిందీ, తెలుగు భాషల్లో నటనపై పట్టు సాధిస్తున్నట్లు వెల్లడించింది.