KNR: ఇల్లందకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి గ్రామంలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ చింతం శ్రీలత ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సుమారు 255 పశువులకు టీకాలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్య క్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.