కోనసీమ: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని జిల్లా ఫైర్ ఆఫీసర్ పార్థసారథి అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి నేటి వరకు 66 అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. కోట్లల్లో నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు పలు ఆసుపత్రులు, పరిశ్రమలు తనిఖీలు చేసి, ప్రమాదాలు జరగకుండా పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.