కడప: జిల్లా బద్వేలు వైసీపీ జడ్పీటీసీ చిన్న పోలిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.33 లక్షల గోల్మాల్ చేశాడని నమోదైన కేసులో 15 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్ లభించింది. ఈ కేసు రాజకీయ ప్రేరితమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బెయిల్ మంజూరుతో చిన్న పోలిరెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.