KDP: వైసీపీ నాయకులను, కార్యకర్తలను పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి దూషించడం శోచనీయమని చక్రాయపేట మండల జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తలు వైయస్ కుటుంబం వెంట ఉన్నారని, అటువంటి వారిపై షర్మిల రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.