BDK: అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్త సహా నలుగురిపై ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన అరుణ్కుమార్ తన భార్య స్వప్నను అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశాడు. అతడి తల్లిదండ్రులు తమ్ముడు కూడా తోడై ఇబ్బందులు పెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు, మరిదిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.