PPM: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మురుగునీరు ఎక్కడా నిలిచిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు కాలువల్లో ప్లాస్టిక్ బాటిల్స్, వ్యర్ధాలు వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.