KRNL: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 40 గ్రామాలను క్షయ విముక్తి గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఆదోని మండలం పాండవగల్లు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉమాదేవికి కర్నూలులో బుధవారం పురస్కారం అందజేశారు. గ్రామ ప్రజలు, హెల్త్ సిబ్బంది సమిష్టి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.