KRNL: ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.