ELR: జిలుగుమిల్లీ మండలం కామయ్యపాలెం గ్రామంలో బుధవారం మహిళలకు కుట్టు మిషన్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పంపిణీ చేశారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.