SDPT: సిద్ధిపేట అర్బన్ పొన్నాల గ్రామపంచాయతీలో ప్రైవేట్ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు బుధవారం ఫీల్డ్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలోని కంపోస్ట్ యార్డును సందర్శించారు. ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను, వ్యర్థాల విభజన, కంపోస్టింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో అనుభవం చాలా ఉపయోగపడుతుందన్నారు.