సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సందర్శకులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రికి విన్నవిస్తూ వినతిపత్రాలు అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వాటి పరిష్కారానికి తగిన కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.