MDK: తూప్రాన్ శివారులోని పురాతన రామాలయ శ్రీరామనవమి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి ఉత్సవాలను ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ పురోహితులు మనోహరాచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బైరం సత్య లింగం, తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.