నెల్లూరు సిటీ 8వ డివిజన్ హిమాలయ స్కూల్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేషన్ కమిషనర్ వైవో. నందన్ బుధవారం పర్య టించారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆక్రమణకు గురైన డ్రైనేజీ కాలువను టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణల తొలగింపుపై తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వేయర్, ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.