AKP: నర్సీపట్నం(మం) చెట్టుపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా పెళ్లిరాట వేసే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ప్రతి సంవత్సరం నవదంపతుల చేతుల మీదుగా పూజలు, కల్యాణోత్సవం నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం అన్నసంతర్పణ, ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. గ్రామ పెద్దల పర్యవేక్షణలో యూత్ సభ్యులు, ప్రజల సహకారంతో వేడుకలు జరగనున్నాయని పేర్కొన్నారు.