ELR: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును MLA రోషన్ కుమార్ కోరారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్యమైన మూడు బ్రిడ్జిలు (గుండేరు, పట్టేన్నపాలెం, బైనేరు) నిర్మాణం, చింతలపూడి బస్సు డిపో ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.