ప్రకాశం: సింగరాయకొండ సాయి నగర్ ప్రాంతంలో అపరిశుభ్రత ప్రదేశాలను గుర్తించి పోలీసులు శుభ్రపరిచారు. ఇలాంటి కార్యక్రమాలు నివారించేందుకు ప్రజలు ముందుకు రావాలని సింగరాయకొండ ఎస్సై మహేంద్ర కోరారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం వలన ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తుందని ఎస్సై తెలిపారు.