VSP: సింహాచలం దేవస్థాన గోశాలలో ‘శబల భోజనాల పండుగ’ను ఏప్రిల్ 1 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల చలపతి రావు తెలిపారు. ప్రకృతి ఆధారిత పంటలతో ఆరోగ్యకరమైన వంటలను ప్రోత్సహించడం లక్ష్యమని చెప్పారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగలలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వంటలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.