KDP: మైదుకూరు పట్టణానికి చెందిన సూర్యనారాయణ (42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం సాయంత్రం తన కుమారుడు నారాయణను పాఠశాలలో వదిలేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా, కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నాడు.