CTR: కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి సామాజిక సేవలో భాగంగా 30 మంది నిరుపేద వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 40 కుట్టు మిషన్లను అందజేశారు. స్వయం ఉపాధితో మహిళలు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.