VZM: ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ఆదివాసీలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర తెలిపారు. విజయనగరంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన గిరిజన నాయకులను ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.