E.G: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన ఆర్డివో కె. ఆనందరావు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, రానున్న పుష్కరాల ఏర్పాట్లపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్లు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.