అన్నమయ్య: గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా శుక్రవారం నందలూరులో పర్యటించారు. రైల్వే గేట్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ పనులు నాసిరకంగా ఉన్నాయని, నీటి లీకేజీ, గుంతల సమస్యలను రాచూరి మురళి తెలియజేశారు. దీనిపై స్పందించిన డీఆర్ఎం త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు.