కోనసీమ: పి.గన్నవరం మండలం నరేంద్రపురంకి చెందిన శేషారత్నం, పోతవరంకి చెందిన శ్రీలక్ష్మి మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు సెంటర్ ఫర్ మేగ్రేషన్ను సంప్రదించగా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో వారి రాక సాధ్యం అయింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుర్తింపు పొందిన ఏజెంట్లు ద్వారానే విదేశాలకు వెళ్లాలని సూచించారు.