ATP: శ్రీరామనవమి సందర్భంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై కొలువు తీర్చి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ఈఓ విజయరాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.