ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ శుక్రవారం మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, ప్రాథమిక చికిత్స అందించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫుల్ మద్యం తాగి ఇంట్లో గొడవ కారణంగా ఈ చర్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.