SRCL: వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సీతారాముల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సుందరంగా అలంకరించిన రథంపై సీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి, పట్టణ వీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, భజనలు, కోలాటాలతో పట్టణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.