KKD: జిల్లా పోలీస్ గ్రౌండ్స్ ఆవరణలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ దంపతులు పాల్గొని, శాస్త్రోక్తంగా నిర్వహించిన కల్యాణ క్రతువులో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శ్రీ రామనాస్మరణతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.