ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజబాబును ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శుక్రవారం కలిశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాడు. తన పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో ఉన్న భూ సమస్యలను ఆయన ప్రస్తావించారు. కలెక్టర్ స్పందిస్తూ తప్పకుండా తాను సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తాననిహామీ ఇచ్చారు.