AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో గల పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు.