BPT: యద్దనపూడిలో పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఎస్సై రత్న కుమారి తెలిపారు. ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.