• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు గూడూరులో జాబ్ మేళా

TPT: గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 20, 2025 / 11:14 AM IST

గన్నవరం మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో వల్లభనేని వంశీ ఏ71 ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

February 20, 2025 / 11:01 AM IST

కాణిపాకం ఆలయానికి విరాళం

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు దాత విరాళమందించారు. విజయవాడకు చెందిన కళ్యాణ వెంకట గణపతి రూ. లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.

February 20, 2025 / 10:47 AM IST

శునకాలకు కుటుంబ నియంత్రణకు చర్యలు

CTR: చిత్తూరు మున్సిపల్ షెడ్డులో నూతనంగా నిర్మించిన శునకాల కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జిల్లాలో 7వేల శునకాలు ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ చేయడమే లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రక్రియకు తిరుపతికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిత్తూరులోని కేంద్రం ప్రారంభించామన్నారు.

February 20, 2025 / 10:43 AM IST

ప్రజల భద్రత వారి చేతుల్లోనే: ఎస్సై

CTR: ప్రజల ఇంటి భద్రత ఇప్పుడు వారి చేతిల్లోనే ఉందని కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో సీసీ కెమెరాలు నేర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. రూ.2000లకు కూడా కెమెరాలు అందుబాటులో వున్నాయని ఎవరైనా సీసీ కెమెరాలు అమర్చుకోవాంటే తమను సంప్రదించాలని కోరారు.

February 20, 2025 / 10:30 AM IST

క్రీడా ప్రాంగణం వద్ద అభివృద్ధి పనులు ప్రారంభం

కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవిఆర్ కిషోర్ ఆధ్వర్యంలో ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వందల మందికి ఆరోగ్యాన్నిస్తున్న క్రీడా ప్రాంగణం అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2025 / 09:18 AM IST

నేడు మాల కార్పొరేషన్ ఛైర్మన్ రాక

KDP: ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ గురువారం కడపలో అందుబాటులో ఉంటారని ఈడీ రాజ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి ఎస్సీ నాయకులతో ముఖామఖి నిర్వహిస్తారని, అనంతరం కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమవుతారని తెలిపారు.

February 20, 2025 / 07:59 AM IST

‘పేదల బడ్జెట్ కాదు కార్పొరేటర్ల బడ్జెట్’

TPT: పుత్తూరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని ఇది కార్పొరేటర్ బడ్జెట్ అన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఏమాత్రం ఉపయోగపడేలా లేదని ఆయన డిమాండ్ చేశారు.

February 20, 2025 / 07:42 AM IST

శ్రీకాకుళంలో వారిపై రౌడీషీట్స్..!

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువయ్యాయి. ఇటీవల విద్యార్థులు సైతం పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు గంజాయి వినియోగించే వారిపై సైతం రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు.

February 20, 2025 / 07:24 AM IST

ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న అజయ్ జైన్

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ దర్శించుకున్నారు. ఆలమ మర్యాదలతో స్వాగతం పలికి, రామాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేద తీరిన ఆయనకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేసి, ఘనంగా సత్కరించారు.

February 20, 2025 / 07:19 AM IST

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ

కృష్ణా: ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఘంటసాలలోని మహాత్మాగాంధీ జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ స్వాతి బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.

February 20, 2025 / 04:12 AM IST

ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశాలు

NTR: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వీరుళ్లపాడు మండలం, గూడెం మాధవరం ఫీల్డ్ అసిస్టెంట్ మన్నే సుధీర్ సస్పెన్షన్‌కు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ బుధవారం ఆదేశాలిచ్చారు. గ్రామంలో వేతనదారులకు పనులు కల్పించడంలోనూ సగటు వేతనం విషయంలో, అనుమతి లేకుండా, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.

February 20, 2025 / 04:08 AM IST

‘రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలి’

కృష్ణా: గ్రూప్-2లోని రోస్టర్ విధానం సవరించాలని అభ్యర్థులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికార పీఠమెక్కిన జగన్ కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారన్నారు. ఈనెల 23న జరిగే పరీక్షకు 92,250 అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారని మండిపడ్డారు.

February 20, 2025 / 04:00 AM IST

‘అసత్య ప్రచారాలను ఖండించిన దళిత నాయకులు’

VZM: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి RRR రఘురామకృష్ణ రాజు ఆర్థిక నేరాలపై విచారణ చేపట్టాలిని విజయనగరం అంబేద్కర్ ఇండియా మిషన్ బుధవారం డిమాండ్ చేశారు. దళిత IPS పీవీ సునీల్ కుమార్ పై చేస్తున్న అసత్య ప్రచారాలను విజయనగరం జిల్లా దళిత సంఘాల సభ్యులు కెల్లా భీమారావు తదితరులు ఖండించారు.

February 19, 2025 / 08:18 PM IST

బూత్ ఇంఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: ద్వారకాతిరుమల మండలం మారంపల్లి గ్రామంలో మండల ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇంఛార్జ్‌ల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

February 19, 2025 / 08:17 PM IST