• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వాటర్ ట్యాంక్‌ను మంజూరు చేయండి’

PPM: కురుపాం మండలం మొండెంకెళ్ళు గ్రామానికి వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఇంటికుప్పుల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్ల నాటి ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, నూతన వాటర్ ట్యాంక్‌ను మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

December 29, 2025 / 02:40 PM IST

విశాఖకు 150 పర్యావరణహిత బస్సులు

VSP: కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-ఈబస్ సేవ’ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించగా.. ఇందులో విశాఖపట్నం నగరానికే అత్యధికంగా 150 బస్సులను అందిచనుండడం విశేషం. ఈ మేరకు ఆపరేటర్లను ఖరారు చేసేందుకు ఈఈఎస్ఎల్ (EESL) సంస్థ ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. త్వరలోనే పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు వైజాగ్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.

December 29, 2025 / 02:39 PM IST

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ATP: కంబదూరు(మం) గూళ్యంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందు–సునీత దంపతుల కుమారుడు చరణ్ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఘటనతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 29, 2025 / 02:39 PM IST

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BPT: చీరాల మండలం బుర్లవారి పాలెంలో సోమవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పంచాయతీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆయన గుత్తేదారులకు సూచించారు. అనంతరం పనులు నాణ్యతగా జరగాలన్నారు.

December 29, 2025 / 02:37 PM IST

రేపు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కె.వి.ఆర్ ఫంక్షన్ హాలులో ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు హాజరు కావాలని MLA కార్యాలయ ప్రతినిధులు కోరారు.

December 29, 2025 / 02:37 PM IST

గుండెపోటుతో డీపీవో ఏవో మృతి.. ఎస్పీ నివాళి

కడప జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో కే. వీ. రమణ (56) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, అదనపు ఎస్పీ రమణయ్య, డీఎస్పీలు, ఇతర సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

December 29, 2025 / 02:33 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు సీటులో కూర్చుని విధులు నిర్వహిస్తుండడాన్ని గమనించి, ప్రైవేటు వ్యక్తి ఎలా పనిచేస్తున్నారని, ఎవరు అనుమతి ఇచ్చారని, ఏం తమాషా చేస్తున్నారా అంటూ సబ్ రిజిస్ట్రార్ రామకోటయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

December 29, 2025 / 02:29 PM IST

‘ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి’

KRNL: ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరని, చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి అన్నారు. మంత్రాలయంలో మండల విద్యాధికారి మొహినుద్దీన్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు ఆధ్వర్యంలో మొహినుద్దీన్‌ను ఘనంగా సన్మానించారు.

December 29, 2025 / 02:29 PM IST

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన డీసీఎంఎస్ ఛైర్మన్

VZM: వేపాడ మండలం అరిగి పాలెంలో ఈ నెల 19న జరిగిన అగ్ని ప్రమాదంలో ముక్కా శ్రీను, పెద్ద అప్పారావుకు చెందిన పశువుల పాకలు పూర్తిగా దగ్ధమై, పశువులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ సోమవారం బాధితులను పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

December 29, 2025 / 02:27 PM IST

విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద రూ. 2.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే టిడ్కో ఇళ్లకు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని తెలిపారు.

December 29, 2025 / 02:26 PM IST

ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం

KDP: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు సోమవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చారు. అలాగే, రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

December 29, 2025 / 02:25 PM IST

చింతలపూడి రెవెన్యూ క్లీనిక్‌లో వినతుల స్వీకరణ

ELR: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని డిప్యూటీ తహసీల్దార్ షకీల్ అన్నారు. సోమవారం చింతలపూడి మండల రెవెన్యూ కార్యాలయంలో రెవిన్యూ సమస్యల సత్వర పరిష్కార కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. Dy. MRO మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ డీటి దుర్గా ప్రసాద్ ఆర్మ్స్ నర్శింహ పాల్గొన్నారు.

December 29, 2025 / 02:25 PM IST

నలగుండ్రాయ స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు

CTR: బైరెడ్డిపల్లె(మం) కడపనత్తంలోని శ్రీ అలిమేలు మంగమ్మ, పద్మావతమ్మ సమేత నలగుండ్రాయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్త మురళీ స్వామి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, సప్తద్వార పూజ, వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహిస్తారని, భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.

December 29, 2025 / 02:24 PM IST

‘కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు’

SKLM: జనవరి 4న ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షులు సీ.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. నేడు ఎచ్చెర్లలో అఖిల భారత మహాసభలు ప్రచారం నిర్వహించారు. కార్పొరేట్ల కు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు. 

December 29, 2025 / 02:23 PM IST

గుడ్ న్యూస్.. విశాఖ-చర్లపల్లి మ‌ధ్య ప్రత్యేక రైళ్లు

విశాఖ: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖ‌-చర్ల‌ప‌ల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ జనవరి 10-19 మధ్య శని, సోమవారాల్లో సాయంత్రం 5:30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:15కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (08512) జనవరి 11-20 మధ్య ఆది, మంగళవారాల్లో మధ్యాహ్నం 3:30కి బయలుదే రుతుంది.

December 29, 2025 / 02:22 PM IST