• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకున్న వెంపటాపు

W.G: 35 ఏళ్లుగా చిత్రకళలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారం తణుకునకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వెంపటాపు వెంకట సత్యనారాయణ అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. ఈయన రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయంగా 200 పైగా అవార్డులను అందుకున్నారు.

March 19, 2026 / 05:06 PM IST

‘దివ్యాంగుల సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’

కోనసీమ: రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారికతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన దివ్యాంగ శక్తి ‘పథకం’ను మంత్రి రామచంద్రపురంలో ప్రారంభించారు.

March 19, 2026 / 05:00 PM IST

మాజీ ఎంపీకి ఉగాది శుభాకాంక్షలు

TPT: నాయుడుపేటలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం ఆయన నివాసంలో టీడీపీ నేత, ఎస్‌జె జువెలరీస్ అధినేత పోట్లపూడి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యంకు శాలువా కప్పి సన్మానించి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

March 19, 2026 / 05:00 PM IST

ఎస్పీకి పోలీసుల ఉగాది శుభాకాంక్షలు

KKD: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను గురువారం జగ్గంపేట సర్కిల్ పోలీసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట సీఐ తిరుపతిరావు, ఎస్సైలు రఘునాథరావు, శివ నాగబాబు, సతీష్ కుమార్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

March 19, 2026 / 05:00 PM IST

రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం

ప్రకాశం: రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం అభినందనీయమని చల్లపల్లి సీఐ కే. ఈశ్వరరావు అన్నారు. గురువారం చల్లపల్లి పడమర వీధి జెండా చెట్టు వద్ధ విశ్రాంత ఉపాధ్యాయుడు అడపా గురవయ్య, అడపా రాంబాబు సహకారంతో నిరుపేద ముస్లింలకు రూ.15 వేలు వ్యయంతో నిత్యావసర సరుకులు అందచేశారు. పఠాన్ కరీముల్లా ఖాన్, పఠాన్ చాన్ ఖాన్, జన్ను అయ్యప్ప, షేక్ కర్ణం, నజీర్ పాల్గొన్నారు.

March 19, 2026 / 05:00 PM IST

ధర్మవరంలో పండగ రోజు తాగునీటి కష్టాలు

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్‌లోని ఎంఈవో ఆఫీస్‌ దగ్గర ఉన్న కాలనీలో నాలుగు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉగాది పండగ రోజున కూడా నీళ్లు రాకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.

March 19, 2026 / 05:00 PM IST

అధికారుల నిర్లక్ష్యాన్ని సహించను: ప్రత్తిపాటి

PLD: చిలకలూరిపేట మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు సమీక్ష నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వేసవిలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.

March 19, 2026 / 05:00 PM IST

మదనపల్లిలో ఘనంగా ఉగాది వేడుకలు

అన్నమయ్య: మదనపల్లిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు, ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం చేసిన పండితులు ఈ సంవత్సరం సుభిక్షం, సస్యశ్యామలం ఉంటుందని తెలిపారు.

March 19, 2026 / 04:59 PM IST

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

SKLM: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గురువారం విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదా శీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

March 19, 2026 / 04:58 PM IST

మల్‌ఖేడ్‌లో ఉరుసు వేడుకలకు ఆహ్వానాలు..!

KRNL: కర్నాటక రాష్ట్రం సేడం తాలూకా మల్‌ఖేడ్‌లో ఈ నెల 28న నిర్వహించనున్న హజరత్ సయ్యద్ ఖలిఫత్ రహమాన్ ఖాద్రి, హజరత్ సయ్యద్ నేమతుల్లా ఖాద్రి ఉరుసు మహోత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను పలువురికి అందజేశారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్ షాహ ముస్తాఫా ఖాద్రి ఆధ్వర్యంలో బాబా శిష్య బృందం, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని, కోసిగి మండల ఇంచార్జీ పి.మురళీని ఆహ్వానించారు.

March 19, 2026 / 04:56 PM IST

అర్చకులకు నగదు పురస్కారం అందజేసిన కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులు అర్చకం ప్రసాద్ శర్మ, జగన్నాథమయ్య, పద్మనాభ భట్టార్, లక్ష్మణాచార్యులను కలెక్టర్ ఆనంద్ ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ. 10,116 నగదు పురస్కారాన్ని అందజేశారు.

March 19, 2026 / 04:50 PM IST

చిరుత పులి దాడి ఘటనలో చిన్నారికి నష్ట పరిహారం

NDL: గత ఏడాది జూలై 13న చిన్నారుట్ల గూడెంలో కుడుముల అంజలి అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి గాయపరిచింది. ఈ మేరకు అటవీ శాఖ నెక్కంటి రేంజర్ పీవీ.సాయి కుమార్ నష్టపరిహారం కింద రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్‌వో వెంకటయ్య, ఎఫ్‌బీవో మదన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 04:43 PM IST

బాల వికాస్ ఫౌండేషన్ ఉగాది సేవా కార్యక్రమం

VSP: ఉగాది సందర్భంగా బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.కె. జోషి, ఇ. అన్నపూర్ణ పాల్గొని బాలలు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని పేర్కొన్నారు.

March 19, 2026 / 04:41 PM IST

ఆలయంలో షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: ఆకివీడు మాదివాడలోని శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన షెడ్డును ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురువారం ప్రారంభించారు. రూ.6.5 లక్షలతో కొటికలపూడి నాగ రవీంద్ర కుమార్-విజయ వాణి దంపతులు షెడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. టీడీపీ నాయకులు మోటుపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.

March 19, 2026 / 04:40 PM IST

యార్లగడ్డలో జనసేనలో చేరిన యువకులు

కృష్ణా: చల్లపల్లి మండలం యార్లగడ్డలో గురువారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన పోతన సాయి, మరికొందరు యువకులు జనసేన పార్టీ సభ్యత్వం పొందారు. వారికి పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు తోట మురళీకృష్ణ, మిరియాల జితేంద్ర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ బొందలపాటి వీరబాబు, పసుపులేటి రవికుమార్ పాల్గొన్నారు.

March 19, 2026 / 04:30 PM IST