కృష్ణా: మొవ్వలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు ఈరోజు ప్రారంభించారు. 2023లో అంగన్వాడి వర్కర్స్ 42 రోజుల పాటు సమ్మె నిర్వహించగా, గత ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం మినిట్స్ కమిటీ ఏర్పాటు చేసి ఆమోదించినప్పటికీ, కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించలేదన్నారు.
NTR: ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నందిగామ RDO ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టరు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గోపాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 1810 మినీవర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు.
ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం పూలకుంటపల్లి పెద్ద తండా గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడుకు ఈ నెల 27, 28 తేదీలలో జరిగే శ్రీ శ్రీ టకరమ్మ, శ్రీ భనకమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.
సత్యసాయి: ధర్మవరంలో టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సోమవారం పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన 26 చెక్కులను అందజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తోందని తెలిపారు.
VZM: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో RDO కీర్తితో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత జిల్లా, మండల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు.
TPT: సత్యవేడు మండలం మధనంబేడు గ్రామంలో మృతి చెందిన గోవిందమ్మ కుటుంబానికి టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ పరుచూరి శివకుమార్ నాయుడు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరఫున పార్టీ ప్రతినిధులు గ్రామానికి వెళ్లి బంధువులకు నగదు అందజేశారు. దహన సంస్కారాల కోసం ఈ సహాయం అందజేసినట్లు తెలిపారు.
VSP: రాబోయే ఏ ఎన్నికల్లోనైనా భీమిలిలో వైసీపీ ఘనవిజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర (సిరమ్మ) ధీమా వ్యక్తం చేశారు. అవనాంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ కమిటీలను వెంటనే పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు బలోపేతం చేయడం లక్ష్యంగా సభ్యత్వాన్ని 25 వేల సంఖ్యకు చేర్చాలని సూచించారు.
ASR: నేరాల నియంత్రణ, నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో మహిళా పోలీసుల పాత్ర ముఖ్యమైనదని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. సోమవారం అరకులోయలో అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. మహిళా పోలీసులు గ్రామాలలో నాటు సారా, గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు.
ELR: బుట్టాయిగూడెం మండలం K.R.పురం ఐటీడీఏ వద్ద యువజన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న వ్యాపార భవన నిర్మాణాలను ఆపివేయాలన్నారు. యధావిధిగా అదే స్థలంలో హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టాలని, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని పిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
CTR: విజయపురం మండలం కొసలనగరం మీట్టురు ఆశ్రమం నందు మంగళవారం శ్రీ రామక్కమ్మ 46వ ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాకులు వాసుదేవస్వామి పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు అఖండనామ భజనలతో ప్రారంభమవుతాయాని తెలిపారు. ఈ సందర్భంగా యజ్ఞం, కోలాటభజనలు, వీధినాటకాలు, ప్రదర్శనలు అమ్మవారి ఊరేగింపు అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని వాసుదేవస్వామి వెల్లడించారు.
కడప: జిల్లా పులివెందులలో మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్ రేపటి నుంచి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నందిపల్లిలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు.పర్యటన సందర్భంగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
KRNL: నందవరం మండల టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్ ఖాసింవలి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా జగన్ ప్రభుత్వం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్ఠను మంటగలిపేలా అప్పటి పాలకులు వ్యవహరించారన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర స్టేట్ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది కొరతపై అసహనం వ్యక్తం చేసి, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్ సమక్షంలో రికార్డులను పరిశీలించి, ప్రజలకు అన్ని సేవలు సమయానికి అందించాలని సూచించారు.
అన్నమయ్య: రాయచోటిలో అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఖలీద్ (22) పై కత్తితో దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఖలీద్ను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందని బాధితుడు తెలిపినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.