• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

ప్రకాశం: పుల్లలచెరువు మండలం పిడికిటివారి పల్లిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. పెద్దిరాజు అనే గొర్రెల కాపరికి చెందిన 15 గొర్రె పిల్లలను గురువారం దాడి చేసి హతమార్చాయి. దీంతో ఆ రైతుకు దాదాపు లక్ష వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరో 8 గొర్రె పిల్లలు తీవ్రంగా గాయపడి మృతి చెంది అవకాశం ఉందని తెలిపాడు.

July 3, 2025 / 05:07 PM IST

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాల పంపిణీ

BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు , వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం దివ్యాంగుల శ్రేయస్సు కోసం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

July 3, 2025 / 04:43 PM IST

‘జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి’

W.G: వచ్చే నెల 6, 7వ తేదీల్లో ఉండిలో జరుగనున్న సీపీఐ 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్‌లో జరిగిన సీపీఐ తణుకు ఏరియా మహాసభలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభకు సీపీఐ నాయకుడు చుండ్రు వెంకట్రావు అధ్యక్షత వహించారు.

July 3, 2025 / 04:35 PM IST

‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

NLR: చేజర్లలో గురువారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

July 3, 2025 / 02:17 PM IST

జాతీయ సదస్సులో పాల్గొన్నడిప్యూటీ మేయర్

NLR: హర్యానా రాష్ట్రం, మానసర్‌లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ( ICAT)లో గురు, శుక్రవారాల్లో పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధుల జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.

July 3, 2025 / 02:08 PM IST

ఎంఈవోకి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి

ATP: పామిడి మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ గురువారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎంఈవో జయ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల బస్సుల సౌకర్యం నిర్లక్ష్యంగా ఉందని వారు పేర్కొన్నారు.

July 3, 2025 / 02:00 PM IST

టాటా డీజీ నెర్వ్ సెంటర్ ప్రారంభం

CTR: కుప్పం ఏరియా ఆసుపత్రిలోని టాటా డీజీ నెర్వ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసేవలు అందించేందుకు సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అదనంగా రెండు వేల మంది సిబ్బంది అవసరమని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పీహెచ్సీలలో డీజీ నెర్వ్ సెంటర్ సేవల తీరును సీఎం వర్చువల్‌గా పరిశీలించారు.

July 3, 2025 / 01:58 PM IST

‘రీ కాల్ చంద్రబాబు’కార్యక్రమం నిర్వహించిన YCP

KDP: రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని YCP నేతలు నాయకులు విజయవంతం చేయాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా పిలుపునిచ్చారు. గురువారం కడప నగరం రామాంజనేయపురంలోని నూతన YCP కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

July 3, 2025 / 01:50 PM IST

ఈనెల 4, 5వ తేదీలలో ఉద్యోగుల నిరసన

VZM: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భానుమూర్తి తెలియజేశారు. గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ గత ఆరేళ్లుగా పెండుంగ్‌లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, ఖాళీగా ఉన్న 10 వేల మంది సిబ్బంది నియామకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

July 3, 2025 / 01:44 PM IST

పొగాకు వ్యతిరేక సంతకాలు సేకరణ

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పొగాకు వినియోగ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొగాకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం DMHO దేవి మాట్లాడుతూ.. జూలై 1 నుంచి 21 వరకు పొగాకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించాలన్నారు.

July 3, 2025 / 01:43 PM IST

‘సమస్యలన్నీ పరిష్కరిస్తాం’

KRNL: నందవరం మండలం మిట్ట సోమాపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యలపై ప్రజలు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించే విధం కృషి చేస్తానని తెలిపారు.

July 3, 2025 / 01:29 PM IST

సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: DSP

GNTR: సోషల్ మీడియా మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ప్రకటనలు చూసి పెట్టుబడులు పెట్టవద్దని, రెట్టింపు లాభాలకు ఆశపడి మోసపోవద్దని హెచ్చరించారు. మోసపూరిత వెబ్‌సైట్‌లు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

July 3, 2025 / 01:19 PM IST

తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: నియోజకవర్గంలో రూ.3.16 కోట్లతో ఆరు కిలోమీటర్లు తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ఏఎస్ఆర్ మండపం వరకు 1040 మీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉపాధి నిధులతో నియోజకవర్గంలో రూ.32.24 కోట్లతో 46.785 కిలోమీటర్ల మేర 522 సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు.

July 3, 2025 / 11:22 AM IST

సుపరిపాలనపై మండల అధ్యక్షుడు ప్రచారం

CTR: ఎస్ఆర్ పురం మండలం ముది కుప్పం పంచాయతీలో గురువారం సుపరిపాలనపై ప్రచార కార్యక్రమం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, నిరంజన్ రెడ్డి, పైనేని మురళి, కేఎం రవి పాల్గొన్నారు.

July 3, 2025 / 11:11 AM IST

బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ లోకసాని వెంగయ్య బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు DEO డాక్టర్ ఆర్ బాలాజీ రావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు MEO -2 రమణయ్య తెలిపారు. సస్పెండ్ కాపీ ఇచ్చేందుకు టీచర్ అందుబాటులో లేరని తెలిపారు.

July 3, 2025 / 11:10 AM IST